మన్యం టీవి, పినపాక:పినపాక మండలం బోటిగూడెం
ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ ITDA భద్రాచలం
ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు సోలార్ లైట్, నోట్ పుస్తకాలను స్థానిక బోటిగూడెం సర్పంచ్ సుధాకర్ అందజేశారు,
సర్పంచ్ గారు మాట్లాడుతూ... ప్రభుత్వం నుండి, ITDA భద్రాచలం వారు గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం గిరిజన విద్య అభివృద్ధి కోసం స్కూల్ బ్యాగ్, ఏక రూప దుస్తులు, స్పోర్ట్స్ డ్రెస్, షూస్, తదితర సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో గల సౌకర్యాలు ఉపయోగించుకొని బాగా చదివి ఉన్నత శిఖరము అధిరోహించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ జ్యోతి,ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావు , పాఠశాల సహోపాధ్యాయులు అర్జయ్య , గ్రామస్తులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: