పత్రిక ప్రకటన 22-11-2021
మన్యం టీవి, పినపాక:
పినపాక మండలం జానంపేట హైస్కూల్ నందు పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యాబోధన చెప్పే మహిళ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వర్కర్లతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులు పెడుతూ విద్యార్థులు మరియు వర్కర్లపై లైంగిక వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటు... ఈ కీచక ఉపాధ్యాయుడు ఒక్క జానంపేట స్కూల్ లోనే కాకుండా గతంలో మణుగూరు కో ఎడ్యుకేషన్ స్కూల్ లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడి కేసులపాలవడం అప్పట్లో సంచలనంగా మారింది, అయిన బుద్ధి మార్చకొని ఈ ప్రబుద్ధుడు ఆ తరువాత పైరవీలతో మళ్ళీ ఉద్యోగం లో చేరి పాండురంగాపురంలో అమ్మాయిపై లైంగిక దాడి.. టేకులపల్లి మండలం బోడులో మరో అమ్మాయిపై లైంగిక దాడికి పాలడ్డాడు, తరువాత జానంపేట హైస్కూల్లో ఈ జరిగిన ఘటన కాకుండా గతంలో రెండు సంఘటనలు జరిగినవి అవి వెలుగులోకి రాకుండా విద్యార్థుల్ని బెదిరించి బయటికి రాకుండా కీచక టీచర్ గా మారి నాడు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో వేధిస్తున్న టీచర్ ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని ఎస్ ఎఫ్ ఐ. సి ఐ టి యు డిమాండ్ చేస్తుంది లేనిపక్షంలో విద్యార్థులను తో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.
Post A Comment: