మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో మండల వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి 52వ జన్మదిన వేడుకలను నియోజక వర్గ నాయకురాలు వగ్గెల పూజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజక వర్గ నాయకురాలు వగ్గెల పూజ పలు చోట్ల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. రాబోవు రోజుల్లో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు అన్ని విధాల నష్టపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు డబుల్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటి వరకు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. రేవంత్రెడ్డి రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొద్దులమడ గ్రామంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక పాఠశాల లో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పంపిణీ చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయుకరాలు వగ్గేల పూజ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నకేశవులు, జుజ్జిరి దుర్గారావు, ఎంపీటీసీ వేముల భారతి, వేముల ప్రతాప్, కొప్పుల శ్రీను, ఎంపీటీసీ అనసూయ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గున్నారు.
Post A Comment: