మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్08):
ములకలపల్లి మండలంలోని 5 మజ్జిద్ ల లో పనిచేస్తున్న ఇమామ్ మరియు మౌజాన్ లకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనం అందించాలని టి ఆర్ ఎస్ పార్టీ ములకలపల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ అశ్వారరావుపేట ఎం.ఎల్.ఏ మెచ్చా నాగేశ్వరరావు కు వినతి పత్రం అందించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరవు జిల్లా మైనార్టీ శాఖ అధికారి కి సమాచారం తెలియపరచగా సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ములకలపల్లి,జగన్నాథపురం, పూసుగూడెం,ముకమామూడి,మజ్జిద్ లలో పని చేస్తున్న ఇమాం,మౌజన్ లకు గౌరవ వేతనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Post A Comment: