మన్యంటీవి, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామానికి చెందిన నారం రవికుమార్ మంగళవారం సత్తుపల్లి వెళ్తుండగా మార్గమధ్యలో పశువులు అడ్డు వచ్చాయి. వాటిని ఢీకొనడంతో రవికుమార్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Navigation
Post A Comment: