మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని పివి కాలనీ లో యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఇటీవల కాలంలో ఎప్పుడు మూసివేసి ఉంటోందని,సత్వరమే ఏటీఎం ను తెరిపించాలని ఖాతా దారుల కష్టాలు తీర్చాలని, బ్యాంక్,ఖాతాదారులు ఐ. ఎఫ్.టి.యు నాయకులు నాసర్ పాషా,యూనియన్ బ్యాంక్ అధికారులను కోరారు. మంగళవారం ఉదయం ఆయన సింగరేణి కార్మికులు, యూనియన్ బ్యాంక్ ఖాతాదారులతో కలిసి మాట్లాడారు,పీ వీ కాలనీ సింగరేణి ప్రాంతీయ వైద్యశాల లో ఏటీఎం గత కొన్ని నెలలుగా పని చేయడం లేదని,బండారు గూడెం లోని యూనియన్ బ్యాంకు లో ఉన్న ఏటీఎం లు కూడా పనిచేయడం లేదని, దీంతో యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. సత్వరమే ఏటీఎం లు పని చేసేలా చూడాలని ఆయన కోరారు.మెసేజ్ లు కూడా సరిగ్గా రావటం లేదని, ఖాతాదారుల ఇబ్బందులు తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు జె.రమేష్, షబ్బీర్ పాషా,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: