CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మానవసేవే మాధవసేవ......

Share it:

 



  •  సమాజసేవలో విజయ్ భాస్కర్ రెడ్డి సేవలు మరువలేనివి 
  •  ములుగు ఎమ్మెల్యే సీతక్క.....
  •  వినయ్ కుమార్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం 
  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం టీవీ మంగపేట.

మానవసేవే మాధవసేవ అని సమాజ సేవ లో ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని సమాజమే తన కుమారునితో సమానమని నమ్మి సేవలు అందిస్తున్న నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు మంగళవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో కీర్తిశేషులు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి జయంతి వేడుకలను వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం  రూపాయలు 30 లక్షల వ్యయంతో నిర్మించిన నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి  వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే సీతక్క లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అకినేపల్లి మల్లారం గ్రామంలో వైకుంఠధామం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను చూసి ఎకరా స్థలాన్ని భూదానం చేసి 10 లక్షల రూపాయల నగదుతో సకల సౌకర్యాలు కల్పించి వైకుంఠ ధామం ఏర్పాటు చేసిన హీరో షోరూం యజమాని మరియు వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ని ఇందుకు సహకరించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి ని సీతక్క అభినందించారు సమాజంలో ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారని కానీ సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పుట్టిన ఊరు కోసం కర్చు చేయాలనే ఆలోచన రావడం సంతోషకరమన్నారు ఇప్పటికే విజయభాస్కర్ రెడ్డి తన కుమారుని పేరిట రూ లక్ష  విలువైన శీతల శవ పేఠిక బహుకరించారని అదేవిధంగా గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ 25 వేల విలువైన కూలింగ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు వినయ్ కుమార్ రెడ్డి పేరిట నిర్మించిన వైకుంఠధామం లో అవసరమైన షెడ్డు బోర్ వెల్ నిర్మాణాలకు తన నియోజకవర్గ నిధి నుండి  రూపాయలు ఐదు లక్షలు మంజూరు చేస్తానని సీతక్క హామీ ఇచ్చారు పేద విద్యార్థులకు రోగులకు వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలను విస్తరించాలని  అందుకు  ప్రజలంతా సహకరించి భాగస్వాములు కావాలని సీతక్క పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క పోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ నాసీరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిట ఈరోజు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా త్వరలోనే అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు అంతకుముందు ఎమ్మెల్యే సీతక్క వైకుంఠధామం లో వినయ్ కుమార్ రెడ్డి ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు మొక్కలు నాటారు సమావేశంలో వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూజారి సురేంద్రబాబు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాడి దామోదర్ రెడ్డి లక్కీ వెంకన్న ధూళిపాల బాలకృష్ణ దూలగుండ నారాయణ   అయ్యారి యానయ్య యూత్ అధ్యక్షుడు నరేందర్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్ రెడ్డి దుర్గాప్రసాద్ సుబ్రహ్మణ్యం నరేష్ రవి దాట్ల శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: