మన్యం మనుగడ వాజేడు. : వాజేడు మండల కేంద్రంలో విచ్చలవిడిగా వరి కోత మిషన్ యాజమాన్యాలు ధరలు నిర్ణయిస్తున్నారు, న్యాయమైన ధరలు నిర్ణయించాలని వాజేడు మండలం తహసీల్దార్ అల్లం రాజ్ కుమార్ కి వినతి పత్రం అందజేసేరు. ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోదెబోయిన. సురేష్. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు దబ్బకట్ల లక్ష్మయ్య. మాట్లాడుతూ వాజేడు మండలం లో ఆదివాసిలు ఆదివాసేతర చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కారణాలవల్ల పండి పండని వరి పంట కోత ఖచ్చి ఉన్నది వరి కోత మిషన్ యాజమాన్యాలు ఎకరంకు ధర నిర్ణయించకుండా, కచ్చితమైన ధరను నిర్ణయించకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి రైతులు ఆదివాసి యేతర చిన్న సన్నకారు రైతులను దోచుకుంటున్న ఈ యాజమాన్యాలపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తాహశిల్దార్ ని కోరారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమం చేయడానికి ఆదివాసి సంఘాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఎం ఎస్ పి ములుగు జిల్లా అధ్యక్షులు స్వాతి ఆలం. రవితేజ. నరసింహారావు. చంటి. తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: