మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 35 ప్యాకెట్లు, 66 కేజీల గంజాయి దీని విలువ సుమారు పది లక్షలు ఉంటుందని, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న గడ్డం రాజాలు, మల్కమ్ వీరభద్రం, గడ్డం వేణు లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. గడ్డం రాజాలు అనే వ్యక్తి గతంలో కూడా అక్రమ గంజాయి రవాణా కేసులో పట్టుబడి రిమాండ్ అయ్యి బయటకు వచ్చి మరల రెండవ సారి అక్రమ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు.
Post A Comment: