మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 12, క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం విద్యా వ్యవస్థలో నూతన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో జాతీయ సాధన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంగన్నపాలెంలోని సెయింట్ అంథోని పాఠశాలలో శుక్రవారం జాతీయ సాధన సర్వే పరీక్షను నిర్వహించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ సాధన సర్వే పరీక్ష జరపటానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, పరిశీలకులను నియమించారు. ప్రత్యేకంగా గుర్తించిన స్కూల్స్ లో పరీక్షలు నిర్వహించే వారి వివరాలు ముందుగానే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు. విద్యార్థులకు నిర్వహించిన సాధన సర్వే పరీక్షల ఫలితాలను జాతీయ విద్యా విధానంలో ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సర్వేను మండల విద్యాశాఖాధికారి వెంకట్ పరిశీలించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, బాలాజీ, ఫీల్డ్ అబ్జర్వర్ జయలక్ష్మి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సుజన, భానుశ్రీ చందన, సాయిరాం, ఉపాధ్యాయులు సర్వే నిర్వాహణలో పాల్గొన్నారు.
Post A Comment: