మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిసర ప్రాంతాల్లో వున్న గుత్తి కోయ గూడెలైన గంటల కుంట,గుండెంగి వాయి,చింతల మోరి మరియు మోడేలు తోగు గుత్తి కోయ గుడెలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో గుత్తి కోయ ఆదివాసీ లకు సేవలు అందించారు.ప్రాథమిక చికిత్స,మందులు అందజేశారు.54 మందికి బాల వికాస్ పిల్లలకు శ్లోకాలు చెప్పడం,సాయి ప్రోటీన్ ఫుడ్ పంపిణీ మాతా శిశు సంక్షేమ సూచనలు,ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సోలార్ లాంతరులను,చీరలను, దుప్పట్లను,దోమ తెరలను ప్రతి కుటుంబానికి పంపిణీ చేసినట్లు శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు మల్లా రెడ్డి తెలిపారు.ప్రతి నెల ఈ గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి వైద్య సేవలు,సాయి ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వి.రవీందర్,వి. ఉమామహేశ్వరరావు, దుర్గయ్య,కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్,వంగపల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: