నిరుపేదలకు అండగా చేతన ఫౌండేషన్
➡️విద్యార్థులను ఆదుకోవడం అభినందనీయం
➡️ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల నవంబర్ (మన్యం మనుగడ) నిరుపేదలకు అండగా చేతన పౌండేషన్ నిలుస్తుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలం పరిధిలో జగ్గయ్య గూడెం ప్రాథమిక పాఠశాలలో చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థుల కు 200 బ్యాగులు, 300 ఇన్ సోలార్ లైట్లు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడు చేతన ఫౌండెషన్ సభ్యులు ఉపాధ్యాయుడు సత్తులల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ పాఠశాల చదువుకునే నిరుపెదలకు చేతన ఫౌండేషన్ అండగా నిలబడడం ప్రతి ఒక్కరూ అభినందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కృష్ణయ్య , టిఆర్ఎస్ మండల అధ్యక్షులు భాస్కర్, తుళ్లూరి బ్రహ్మయ్య, జెడ్ పి టి సి పోషం నరసింహారావు, కోలేటి భవాని శంకర్, మోకాళ్ళ వీరస్వామి, సుధాకర్, అబ్దుల్ నబీ, చేతన ఫౌండేషన్ రషీద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: