పోడు సాగు దారులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్
✍️పోడు రైతులు దరఖాస్తు చేసుకోండి
✍️భవిష్యత్తు లో మళ్ళీ పోడు పట్టాల అవకాశం రాకపోవచ్చు
✍️ఏజెన్సీ లో స్వయం పాలన సీఎం కేసిఆర్ తో సాధ్యమైనది
✍️ప్రతిపక్షలా అడ్డగోలు మాటలకు మోసపోవద్దు ... గోస పడుతారు
➡️ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల నవంబర్ (మన్యం మనుగడ) మళ్లీ మళ్లీ పట్టాలు రావు పోడు రైతుల దారులు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం గుండాల ,ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించి ఆయన పోడు రైతు దారులకు సూచించారు. నవంబర్ 8 వ తారీకు నుండి పోడు భూములు పట్టాలకు దరఖాస్తుల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. పోడు వ్యవసాయంచేసె రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవలి నేను అసెంబ్లీలో పోడు సమస్య కోసంమాట్లాడిన వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పట్టాల కార్యక్రమం వేగవంతం చేశారన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో ఉన్న పోడు రైతు దారులకు నిబంధనల ప్రకారం పట్టాలు జారీ అవుతాయని ఆయన పేర్కొన్నారు. పోడు వ్యవసాయం చేసే ప్రతి రైతు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం తాసిల్దార్ రంగు రమేష్, టిఆర్ఎస్ పార్టీ మండల భాస్కర్, మోకాళ్ళ వీరస్వామి, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: