మన్యం టీవీ కరకగూడెం:
అటవీ హక్కుల గుర్తింపు నోడల్ అధికారి,ఏజెన్సీ సమికృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం 2012చట్టం ఫారం ఏ,బి,సి ప్రకారం ఉమ్మడి,వ్యక్తిగత వాడుకలు గుర్తించి నెలమీద రుజువులతో పట్టాలను తయారు చేసి,అటవీ హక్కుల అర్జీ పత్రానికి జత చేసి అటవీ హక్కుల కమిటీకి సమర్పించాలని భద్రాచలం ప్రాజెక్టు అధికారి పోట్రు గౌతమ్ కి ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి,పరిచిలించి డివిజన్ కమిటీకి సమర్పించాలి.
ఈ విధంగా ప్రతి అర్జీదారునికి అవగాహన కల్పించి స్వేకరిస్తే తిరస్కరణ గురి అయ్యో అవకాశం ఉండదు,ఈ విధంగా చేయని యడల తీరస్కరణకు గురి అయ్యో అవకాశం ఉంటుందని ఐటిడిఏ పిఓ కి తెలిపారు.కావున 2012 చట్టం ప్రకారం అటవీ హక్కుల కమిటీకి అవగాహన కలిపించి అర్జీ దారులనుండి దరఖాస్తులు స్వేకరించే విధంగా చొరవ చూపించగలరని భద్రాచలం ప్రాజెక్టు అధికారికి కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షమా పరిషత్ కోశాధికారి సోలం రామారావు,తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి సుతారి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: