- అతి బారి లారీలతో ఇసుక తరలించడంతో ధ్వంసమవుతున్న రోడ్లు
- ఇబ్బందులకు గురవుతున్న ఆళ్లపల్లి మండల ప్రజలు
గుండాల / ఆళ్ల పల్లి నవంబర్ 19 (మన్యం మనుగడ) ఇసుక పోయే ఇసుక తో పాటు రోడ్లు పోయే, ఆళ్ల పల్లి మండలంలో జరుగుతున్న ఇసుక ర్యాంపు ల వలన రహదారులు పెద్ద మొత్తంలో దెబ్బతింటున్నాయి. అతిపెద్ద లారీలతో ఇసుక రవాణా చేయడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు నానా ఇబ్బందులు గురవుతున్నాయి. అనుమతులకు విరుద్దంగా జల్లేరు వాగు లో నుండి ఇసుకను యంత్రాల ద్వారా తీసి పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. దీని కారణంగానే భారీ వాహనాలు వెళ్లడం వలన రహదారులు దెబ్బతింటున్నాయి. మరికొన్ని రోజులు ఇలా జరిగితే రహదారులు పూర్తిగా ధ్వంసం అవుతావని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అనుమతులకు విరుద్దంగా నడుస్తున్న ఇసుక ర్యాంపు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
Post A Comment: