మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని ప్రాజెక్టు నగర్ గొత్తి కోయ గూడెం లో మంగళవారం ఎస్ఐ తహెర్ బాబా ఆధ్వర్యంలో మంగపేట పోలీసులు గూడెంలోని ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి కార్డెన్ సెర్చ్ నిర్వ హించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గూడెంలోకి కొత్త వారిని ఎవరిని రానియ్యవద్దని ఆశ్రయం కల్పించ వద్దని హెచ్చరించారు. అనుమానస్పదంగా కన్పిస్తే పోలీస్ స్టేషన్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని,ఎవరైనా కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లయితే వారిమీద చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్డెన్ సెర్చ్ లో సివిల్, సీఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Post A Comment: