మన్యం టీవీ మంగపేట.
మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రములో పొదుమూరు ముస్లిం వాడలో కరెంట్ ,నీటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్టు మహాజన సోషలిస్టు పార్టీ మంగపేట మండల ఇంచార్జ్ గుగ్గిళ్ళ సురేష్ మాదిగ అన్నారు.ముస్లిం వాడను సందర్శించి అక్కడ నివాసం ఉంటున్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ముస్లిం వాడలో కరెంట్ స్థంబాలు లేక 15 కుటుంబాల వారు గత10సంవత్సరాలుగా వారికి కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి సౌకర్యం లేక వాడలో ప్రజలు కొన్ని సంవత్సరాలు గా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా చొరవతీసుకోని కరెంట్ ,నీటి సమస్యలు తీర్చాలి అని సురేష్ మాదిగ కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ గౌసియా,షేక్ ఫాతిమా,మహ్మద్ యాకుబీ,మహ్మద్ రజియా,షేక్ రసీదా,షేక్ అఖిలా,అనీష్,బుజ్జి బాబు,గాజు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: