చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పొడుదారులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకే ప్రభుత్వం పొడుదారుల నుండి దరఖాస్తులు స్వీకరణ చేస్తుందని, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పోకలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... తొలుత పోడుదారుల నుండి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ప్రజా సమస్యలను సాధరంగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అటవీ హక్కులు రక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామస్థాయిలో పొడుదారులు నుండి దరఖాస్తులను సమీకరించి కమిటీలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు దార బాబు, జిల్లా కోప్షన్ సభ్యులు రసూల్, జిల్లా నాయకులు మేడ మోహనరావు, వెంకట్నారాయణ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: