మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల మొదటి సెగ్మెంట్ చిన్నం శెట్టి బజారు లొ గల రోడ్డును అశ్వారావుపేట మేజర్ పంచాయితీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు ను స్థానిక ఎంపీటీసీ వేముల భారతి పర్యవేక్షించి నాణ్యమైన మెటీరియల్ తో నిర్మించాలని కాంట్రాక్టర్ దారునికి తెలియజేసారు. ప్రతి వార్డు లొ సిమెంట్ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ కూడ అస్తవ్యస్తంగా ఉందని, అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితి ని అనేక అభివృద్ధి పనులతో ముందుకు తీసుకు వేళల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె తెలియజేసారు.
Post A Comment: