CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజా కవి కాళోజీ సేవలు మారవలేనివి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా పరిషత్తు కార్యాలయంలో ప్ర‌జాక‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు19వ వ‌ర్ధంతి ఘ‌నంగా నిర్వహించారు.జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి  కుసుమ జగదీష్ కాళోజీ చిత్ర పటానికి పులా మాల

వేసి నివాళుల‌ర్పించారు. 

ప్రజాకవి,పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు నిజాం నిరంకుశత్వానికి,అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు అని అభివర్ణించారు.తెలంగాణ ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌కు కాళోజీ రచనలు,కవిత్వం అంటే ఎంతో అభిమానమని తెలిపారు.పుట్టుక,చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు,వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ కుమార్,ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్,సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,తాహిర్ పాషా,వేల్పురిసత్యనారాయణ,యువజన నాయకులు పొలం శ్రావణ్,ములుగు నియోజకవర్గ స్థాయినాయకులు,మేధావులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: