మన్యం టీవీ కరకగూడెం: ఆదివాసి మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా 146 వ జయంతి వేడుకలు మండల పరిధిలోని రఘునాధపాలెం,బుద్దారం చిరుమళ్ళ గ్రామస్తులు ఘనంగా నిర్వహించి జెండాలు వేగర వేశారు.ఈ సందర్భంగా చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహరావు మాట్లాడుతూ బిర్సా ముండా 1875 నుంచి బ్రిటిష్ వలసవాద దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోధుడు బిర్సా ముండా అన్నారు. బిర్సా ముండా 146వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ జన జాతియ గౌరవ్ దివాస్ ప్రకటించిన నేపథ్యంలో లో మన్యం వీరుడు బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగిందనే గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరుమళ్ళ గ్రామస్తులు చందా భూపతయ్య, చర్ప సాంబశివరావు,చందా రామకృష్ణ, జగన్ పోలెబోయిన జయబాబు యువత,బుద్దారం జంగుబాయి యూత్ గ్రామపెద్దలు, కొమరం లక్ష్మీ నారాయణ,మైపతి శంకర్ రావు,కొమరం రాంబాబు, మైపతి వెంకటనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: