చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: రైతుల కోసమే సహకార సంఘాలు ఏర్పాటు జరిగిందని గానుగుపాడు సహకార సంఘం అధ్యక్షులు చెవుల చందర్రావు అన్నారు. ఆదివారం గానుగపాడు సహకార సంఘం గోదాములో సహకార వారోత్సవాల సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..... రైతుల కోసమే సహకార సంఘాల వ్యవస్థ ఏర్పాటు జరిగిందని, రైతులు సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోసొసైటీ సీఈఓ లంక నరసింహారావు, సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, డైరెక్టర్లు రామిశెట్టి సరళ, మారమ్మ, పసుపులేటి వెంకటేశ్వర్లు, రైతులు చెవుల ఆదెయ్య, అబ్బాస్ అలీ,బేతి రాములు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: