మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం,మల్లెల మడుగు గ్రామానికి చెందిన పిండిప్రోలు వెంకన్న అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యానికి ఆర్థికస్తోమత లేదు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు తమ స్నేహితుడు అనారోగ్యంతో బాధ పడుతున్నా డని,వైద్యానికి ఇబ్బంది పడుతున్నడని తెలుసుకొని తమవంతు సహాయం చేయాలని ఆలోచన తో మండలపరిధిలోని మల్లెల మడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు (2000-2001)తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసి వెంకన్న కుటుంబానికి ఆదివారం 26 వేలు రూపాయల ఆర్థిక సహాయం వెంకన్న తల్లి కి అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా కొడుకు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని మా ఇంటికి వచ్చి ఆర్ధిక సహాయం అందజేసిన నా కొడుకు స్నేహితులకు ధన్యవాదములు అన్నారు.స్నేహితులు మా చిన్ననాటి స్నేహితుడికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని మాతో చదువుకున్న స్నేహితులందరం కలిసి వైద్య ఖర్చులనిమిత్తం చిన్న ఆర్ధిక సహాయం అందచేశామని మా స్నేహితుడు త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు.
Navigation
Post A Comment: