మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(నవంబర్-14):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని విశాల సహకార పరపతి సంఘం ( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) కార్యాలయంలో అఖిల భారత సహకార సంఘం 68 వ వారోత్సవాల సందర్భంగా విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సహకార సంఘం వారోత్సవాల కార్యక్రమంలో విశాల సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షులు నాయుడు చెన్నారావు, డైరెక్టర్ నాగు, సీఈఓ నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: