మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ సుందరీకరణ లో భాగంగా రూ.1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రహదారి డివైడర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను దీపావళి పండుగకు మణుగూరు పట్టణ ప్రజలకు కానుక సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. మిరుమిట్లు గొలిపే ఎల్ఈడి లైట్లతో పట్టణం వెలిగిపోతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్, కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,రుద్ర వెంకట్, పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: