మన్యం టీవీ కరకగూడెం: గిరిజన సహకార సంస్థ లి,, మణుగూరు బ్రాంచ్ అధ్వర్యంలో మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో జిసిసిమ మేనేజర్ దావిడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం ఏ రకం క్వింటాకు. రూపాయలు1960:00 సాధారణ రకం క్వింటకు రూపాయలు 1940:00 చొప్పున వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి పదిహేను రోజుల వ్యవధిలో నేరుగా రైతు ఖాతాలో జమ అవుతాయని అన్నారు. రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ,బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్, సంబంధిత సేల్స్ మెన్ కు అందజేయాలనే తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లగూడెం జి సి సి సేల్స్ మెన్ కొజ్జా దశరథం రైతులు ఎలా బోయిన పిచ్చయ్య, నరసయ్య, ఇర్ప నాగేశ్వరరావు , రాంబాబు, సాయన్న, రామనాథం ,నరేందర్ నాగేశ్వరరావు ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: