- రైతు ఆరు కాలం కష్టపడి పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం :పిఎసిఎస్ చైర్మన్ రవిశేఖర్ వర్మ
మన్యం టీవీ కరకగూడెం: పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని మోతే గ్రామం లో లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పినపాక పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం గింజలను కొనుగోలు చేసి తీర్థం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఈఓ అనిల్ , రేపాక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రావుల కనకయ్య, కొండే రాము, ఆర్ ఐ రాజు, చందా.కాంతరావు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: