మన్యంటీవి, అశ్వారావుపేట: గడిచిన మూడు రోజుల క్రితం చిలకల గండి ముత్యాలమ్మ గుడి వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న అనాధ మహిళను చిట్టితల్లి ఆంబులెన్స్ లో మూడు రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మరణించగా ఆమె ఎవరూ లేని అనాధగా గుర్తించిన చిట్టితల్లి సేవాసమితి, పోలీస్ శాఖ మరియు గ్రామ పంచాయతీ వారి ఆదేశాల మేరకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్ఐ చల్లా అరుణ మేడం, అశ్వారావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, పంచాయితీ ఈవో గజవల్లి హరికృష్ణ, నారం వారిగూడెం పంచాయతీ సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం, చిట్టితల్లి ఆంబులెన్స్ బాజీ, దాసరి సాంబ, కొప్పుల ధర్మరాజు, గుర్రాల సాయిరాం, కొలారాము, దాసరి శ్రీను, కొరస ధనుష్, అయినాల స్నేహిత్, గడ్డం చందు, నార్ల పార్టీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా పేదలు గాని అనాధలు గాని ఉంటే ఉచితంగా అంత్యక్రియలు చేయడానికి చిట్టి తల్లి సేవా సమితి చిట్టితల్లి ఆంబులెన్స్ వారు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటామని తెలియజేశారు.
Navigation
Post A Comment: