మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు పినపాక మండల నేతకానీ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు ఆర్ఎంపి, సహాయ కార్యదర్శి జాడి కిరణ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాత ముత్తాతల కాలంనుండి తరతరాలుగా , స్వాతంత్ర్యానికి పూర్వం నుండి సువిశాలమైన గోదావరినది పరీవాహక ప్రాంతంలో ఆదివాసిలతో సహజీవనం చేస్తూ కలిసి-మెలిసి జీవిస్తున్నామని, ఈ ప్రాంతంలో ఆదివాసీల సంస్కృతిసాంప్రదాయాలు ఎంత పురాతనమైనవో నేతకానీల సంస్కృతి_సాంప్రదాయాలు కూడా అంతే పురాతనమైనవని అన్నారు. ఇక్కడే పుట్టి,ఇక్కడే పెరిగి, ఇక్కడే చస్తూ తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు లేక , కట్టుకున్న ఇంటికి హక్కు లేక, ఉద్యోగ _ఉపాధి అవకాశాలు లేక సర్వస్వం కోల్పోయి దుర్భర జీవనం సాగిస్తూ దినదిన గండంగా బ్రతుకు తున్నామన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో కులాలను ఆదుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన స్థితిలో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతూ తరతరాలుగా నేతకానీలు సాగుచేసుకుంటున్న పోడుభూములకు హక్కులు కల్పించాలని అన్నారు.
అనంతరం గుమాసు లక్ష్మణ్ మాట్లాడుతూ నేతకానీలు తరతరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే ఏజెన్సీలో నేతకానీలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్య పరిస్కారం కోసం ప్రభుత్వ విప్ , పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు రేగా కాంతరావు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నేతకానీలతోపాటు దళితబహుజనులు ఏజెన్సీలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని , రాజకీయ కోణంలో కాకుండా, మానవతా దృక్పథంతో ఆలోచించి ఏజెన్సీలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీలు దళిత _బహుజన సమస్యల పరిస్కార దిశగా కృషి చేయాలని అన్నారు. ఏజెన్సీలో దళితబహుజనుల సమస్యలు ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లడంలో మీడియా మిత్రుల పాత్ర మరువలేనిదని , ఇకముందు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని దళిత_బహుజన సమస్యలను మానవీయ కోణంలో ఆవిస్కరించి కేంద్ర _రాష్ట్ర ప్రభుత్వాల దృస్టికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులని కోరారు. ఈ సమావేశంలో జాడి చిట్టిబాబు, గుమాసు సుదర్శన్, జాడి సతీష్, గుమాసు నరసింహారావు, గుమాసు కృష్ణ, చప్పిడి విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: