మన్యం మనుగడ, పినపాక:
72 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శేషుబాబు అధ్యక్షతన భారత రాజ్యాంగ గొప్పతనాన్ని తెలియజేసే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మువ్వ వెంకటేశ్వరరావు హాజరై విద్యార్థులకు రాజ్యాంగ రచన పై, రాజ్యాంగం పై అవగాహన కల్పించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలు భారత రాజ్యాంగం యొక్క చలువేనని తెలియజేశారు. ముఖ్యంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ వారు ఎంతో ముందు చూపుతో తీసుకువచ్చినా రిజర్వేషన్ల వలన ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి పొందాలని తెలియజేశారు. ఈ కళాశాల ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: