మన్యం మనుగడ, పినపాక:
యుటిఎఫ్ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 28న భద్రాచలం పట్టణంలో జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వి.ఎస్. ప్రసాద్ కోరారు. ఈ బయ్యారం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు .ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో యుటిఎఫ్ సభ్యులు హాజరు కావాలని కోరారు .ఈ సమావేశంలో పినపాక మండల యుటిఎఫ్ అధ్యక్షులు బి.హనుమ, ప్రధాన కార్యదర్శి బి భాస్కర్,ఉపాధ్యక్షులు కిరణ్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: