- పంట కోసిన, కోతకు వచ్చిన సమయంలో కురిసిన వాన
- అధిక రేట్లతో దోచుకుంటున్న వరికోత యంత్ర యజమానులు
మన్యం మనుగడ, పినపాక:
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు అనే పద్యం ప్రకారం బంధువు అయి ఉండి సాయము చేయలేని వారు, ఎంత ప్రార్థించినా వరమును ప్రసాదించని దేవుడు అన్నదాతను కష్టాలపాలు చేస్తున్నాడు. గత వారం రోజుల నుండి ఆరుగాలం పంటలు పండించిన రైతు కోతలు ప్రారంభించాడు. కోసిన పంటను ఆరుదల కోసమని ఉంచగా, అకాల వర్షం అన్నదాతను పలకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పలు ప్రదేశాలలో శనివారం నాడు తుఫాను కారణంగా అకాల వర్షం సంభవించగా ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి పోయింది. పైన పరచిన పట్టాల లో ఎక్కువ మొత్తంలో నీరు చేరగా, రైతులు పాత్రలో నీరు ఎత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతన్నలు చేసే మొదటి పని దేవుడా ఎటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడు తండ్రి అని ప్రార్థిస్తారు. రైతన్నల మొర వినని ఆ దేవుడు, అకాల వర్షం కురిపించాడు. అసలు ధాన్యం కొనుగోలు దారులు రైతులను తేమశాతం, అది ఇది అని నానా ఇబ్బందులు పెడుతుంటే, ఈ అక్కరకు రాని చుట్టము వచ్చి రైతన్నలను బాధిస్తుంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం పంటలను కొనే ఆలోచన లేకపోవడం అన్నదాతను ఒకింత అసహనానికి గురిచేస్తుంది.
Post A Comment: