CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారుకు ప్రతి ఒక్కరికి తక్షణమే హక్కు పత్రలు ఇవ్వాలి. 👉 సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య డిమాండ్

Share it:

 



మాన్యం మనుగడ/ప్రతినీతి:ములకలపల్లి:(నవంబర్1) సిపియం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోడు భూముల హక్కులు జారీ చేసే విషయంలో రాజకీయ జోక్యం తగదని,నేటి వరుకు సాగులో ఉన్న పోడు భూములకు ప్రతి ఒక్కరికి పోడు హక్కు పత్రలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఎఫ్ఆర్ సి కమీటీలను కొనసాగించాలని,ఫారెస్టు అధికారులు పోడు భూముల్లో ట్రాంచ్ లు కందకాలు తీయడం తక్షణమే నిలిపివేయాలని,పీసా కమిటీ ల ద్వారా గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి హక్కు పత్రలు జారీ చేయాలని,సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని తీసుకొని పోడుసాగుదారులకు ఇస్తామని చెప్పడం చూస్తుంటే  పేదల మద్య చిచ్చుపెట్టి సమస్య నుండి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఏజె రమేష్,పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,గౌరి నాగేశ్వరరావు, గోగ్గల ఆదినారాయణ, పోడియం వెంకటేశ్వర్లు,వూకంటి రవికుమార్,నిమ్మల మధు,కుంజా రాముర్తి,గోపగాని లక్ష్మీ నర్సు,మంచాల సారయ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: