మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు వావిలాల స్వామి మాట్లాడుతూ.. మంగపేట మండల కేంద్రంలోని ఉన్న ఎస్సీ పాఠశాల మరియు కళాశాల ములుగు మండలం మల్లం పల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని నడిపించేందుకు అందులో విధి నిర్వహణ చేస్తున్నటువంటి కొందరు ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారని ఇప్పటికైనా పునరాలోచన చేసి ఎస్ సి గురుకుల పాఠశాలను ఏటూరు నాగారం లో వారికి కేటాయించిన స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేసి పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని అన్నారు.ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన టువంటి 70 లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని,ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కళాశాలను తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వావిలాల నరసింహారావు, సాంబశివరావు,ఎంపెళ్లి రాజు, గాడిచర్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: