మన్యం టీవీ ఏటూరు నాగారం
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారో వాటిని ఈ సంవత్సరం పాటు రైతులు ఢిల్లీ నడిబొడ్డున పోరాటాలు చేస్తూ 700 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న ప్పటికీ సైతం ఉద్యమాన్ని కొనసాగించడం రైతుల విజయంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి దావూద్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఖచ్చితంగా అమలు చేయాలని ఇదే కాకుండా ఏదైతే విద్యుత్ సవరణ బిల్లు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ఇంకా అనేక డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటాన్ని విరమించేది లేదని రైతు సంఘాల నాయకులు తెలపడం గర్వించదగ్గ విషయమన్నారు.అదేవిధంగా లఖింపూర్ రైతుల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు.
Post A Comment: