- రిటైర్ ఉద్యోగి జలగం లీలా సంతోష్ కుమార్ ఆర్ధిక ప్రోత్సాహం.
- విద్యార్థుల ను ఆకర్షించేందుకు ఉపాధ్యాయుల వినూత్న కార్యక్రమం.
మాన్యం మనుగడ/ప్రతినిధి: ములకలపల్లి:(నవంబర్ 20):
తిమ్మంపేట ప్రాధమికొన్నత ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలను పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుతున్నారు. పాఠశాల అభివృద్ధికి ఎన్నో నిధులు విరాళంగా ఇచ్చిన రిటైర్ ఉద్యోగి జలగం లీలా సంతోష్ కుమార్ ప్రోత్సాహం,ఆర్థిక వెసులుబాటుతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 80 మంది విద్యార్థులకు వారి వారి పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం గత రెండు సంవత్సరాలా నుండి కోనసాగుతూ వస్తుందని,ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగజేస్తూ, విద్యార్థుల హాజరు శాతం కూడా మెరుతగుపడుతుందని,ఈసందర్బంగా ప్రధానోపాధ్యాయులు శంకర్ రాథోడ్ తెలిపారు.ఇదే పాఠశాల లో 4 వ తరగతి చదువుతున్న పోతుగంటి పినాకిని అనే విద్యార్థి పుట్టిన రోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా జరూపుకున్నారు. ఈకార్యక్రమం వల్ల విద్యార్థుల ముఖాల్లో ఎంతో సంతోషం కనిపిస్తుందని,పాఠశాలకు క్రమం తప్పక రావాలనే స్పృహ కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్,ఉపాధ్యాయులు శ్రీనివాస్, ధనలక్ష్మి,ముత్తేశ్వర్రావు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: