CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని బస్ డిపో సూపరిండెంట్ కు ఎస్ఎఫ్ఐ వినతిపత్రం అందజేత-:ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు నవీన్ కొట్టే.

Share it:

 

 


మాన్య మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్20):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్ ఆఫీస్ సూపరిండెంట్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే మాట్లాడుతూ గతంలో కొత్తగూడెం నుంచి ములకలపల్లి జగన్నాధపురం కమలాపురం మీదుగా ప్రయాణించే బస్సు ప్రస్తుతం నిలిపివేయడంతో విద్యార్థులు కళాశాల వెళ్లడానికి, అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని,ఆటోలో కి వెళ్లడానికి చార్జీలు లేక విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందని, కాబట్టి తక్షణమే బస్ డిపో మేనేజర్ స్పందించి ములకలపల్లి జగన్నాధపురం కమలాపురం మీదుగా నడిచే బస్సులు మళ్లీ ప్రారంభించాలని కోరారు. అనంతరం బస్ డిపో సూపరిండెంట్  స్పందించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: