- బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ
- భారతదేశ అభివృద్ధి లో కీలకపాత్ర పోషింది కాంగ్రెస్ నే.
- ములుగు జిల్లా కేంద్రములో ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ.నిస్వార్థ రాజకీయ ప్రధానిగా అడుగిడి స్వార్థానికి ఆమడదూరంలో ఉంటూ పేదలు ఆర్థికంగా ఎదగాలనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానమని అన్నారు.
భారతదేశాభివృద్ధికోసం ఎనలేని కృషిచేసిన భారత ప్రధానులలో అత్యున్నత ఘనత దక్కించుకున్న మొదటి మహిళా ప్రధాని అని అన్నారు.
ఆహర్నిషలు కష్టపడి నిరుపేదల అభివృద్ధికోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధికే దక్కుతుందని అన్నారు.సాగు,తాగు నీరు లేక కష్టపడుతున్న దళితుల అభివృద్ధి కోసం నిర్విరామ కృషి చేసిన ఘనత ఇందరాగాంధి దేనని అన్నారు.
దేశాభివృద్ధిలో ఇందరాగాంధీ చేసిన సేవలు అమోగమని,
స్వార్ధపూరిత రాజకీయాలకు చోటు లేకుండా దేశంకోసం పనిచేసి అభివృద్ధికి నాందిగా పేరుతెచ్చుకుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనోతు రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు,మాజీ ఉప సర్పంచ్ ఏళ్ళవులా అశోక్,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రేవంత్ నాయక్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ
రాహుల్,జిల్లా మహిళ నాయకురాలు మల్లిక,నాయకులు
మేడం రమణ కర్,చంద్,ప్రభు,
యకా రాజు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: