మన్యం టీవీ : ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి గ్రామం లో పొడుగు లక్ష్మీనారాయణ గత రెండు సంవత్సరాలుగా పక్షవాతం తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పక్షవాతానికి చికిత్స కోసం దాతల సహాయం కోసం ఎదురు చూడ సాగారు. ఆ కుటుంబ సభ్యులు ఆదివాసీ హెల్ప్ లైన్ గ్రూప్ సభ్యులు కారం రాంబాబు గారి ద్వారా సహాయం కోసం సంప్రదించారు. స్పందించిన ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ సభ్యులు అయినటువంటి ఆదివాసి ఉపాధ్యాయులు, ఉద్యోగులు విరాళాలు సేకరించి రూ 5000/- పొడుగు లక్ష్మినారాయణకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో ఆదివాసి హెల్ప్ లైన్ ఉపాధ్యక్షులు ఊకే కృష్ణ, ఆదివాసి హెల్ప్ లైన్ అధ్యక్షులు పట్టం లింగరాజు, చుంచు రవీందర్, కుంజ లక్ష్మీనారాయణ, కొటెం వీరభద్రం, కబ్బాకుల వెంకన్న, కారం రాంబాబు, కల్తీ రామకృష్ణ, సిద్దబోయిన బిక్షం, దారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: