చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులకు పెట్టాల్సిన ఆహారాన్ని సక్రమంగా పెట్టకుండా నిధులను దుర్వినియోగం చేశారు. విద్యార్థులకు వారానికి ఐదు సార్లు పెట్టాల్సిన గుడ్లను, మూడు సార్లు,మటన్ రెండుసార్లు పెట్టాల్సి ఉండగా అసలు పెట్టకపోవడం, పండ్లు, అల్పాహారం పెట్టకుండా విద్యార్థులను పస్తులుంచారు. తనిఖీలో భాగంగా వివరాలు ఇలా ఉన్నాయి..... మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం మేరకు మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గురువారం కేజీబీవీ ని తనిఖీ చేశారు.ఈరోజు పెట్టాల్సిన రాగిజావ కు బదులుగా గోధుమ ఉప్మా వండి విద్యార్థులకు పెట్టిన విషయం బయటపడింది. విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి వివరాలు అడగగా వాస్తవాలు వెల్లడయ్యాయి. మెనూ ప్రకారం గుడ్లు, మటన్, చికెన్, పండ్లు, అల్పాహారం పెట్టని విషయాలను విద్యార్థులు నేరుగా ఎంఈఓ కు తెలియజేశారు. మెనూ అమలు చేయని విషయాన్ని అధికారులకు తెలియజేస్తే టీసీలు ఇచ్చి బయటకు పంపుతానని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంత కుమారి ఎదిరించిన విషయాన్ని సైతం విద్యార్థులు బహిరంగంగా తెలిపారు. దీంతో ఎంఈఓ స్పెషలాఫీసర్ కాంతకుమారి పై వాస్తవాలను ఉన్నత అధికారులకు తెలియజేస్తాం అని తెలిపారు.మెనూ అమలు చేయని కేజీబీవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Post A Comment: