మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం ( నవంబర్-12)::అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ బొగ్గం సీతామహాలక్ష్మీ. శుక్రవారం నాడు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరి, మెచ్చా చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి, ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు, నాయకులు బండి మాధవరెడ్డి, బొగ్గం బజారు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: