మన్యంటీవి, అశ్వరావుపేట: కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టియినా ధాన్యం కొనుగోలు చేయిస్తా మని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. అశ్వరావుపేట లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతుల ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతుల పక్షాన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 3 నల్ల చట్టాల వల్ల రైతు వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో పంజాబ్ తరువాత వరి పండించే రాష్ట్రం తెలంగాణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ అన్ని మండలాల ప్రజా ప్రతినిదులు, మండల, గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, ఐఎస్ సిఎస్ చైర్మన్ లు, డైరెక్టర్లు, పార్టీ నామినే టెడ్ పదవిలో ఉన్న సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీలు, పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: