మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు జిల్లా వైద్య అధికారి దయానంద స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో గల వసతులపై ఆరా తీసి, మన్యం ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శివ కుమార్ ను అభినందించారు. గర్భిణీ స్త్రీల కోసం నూతనంగా ప్రారంభించబోయే కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్ల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: