మన్యం మనుగడ, పినపాక:
నూతన విద్యుత్ చట్టం రద్దుచేయాలని యు ఈ ఈ యు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు కొలగాని రమేష్, బొల్లి వెంకటరాజు డిమాండ్ చేశారు.
ఏడూళ్ల బయ్యారంలో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ, నూతన విద్యుత్ చట్టం వలన ప్రభుత్వరంగంలో వున్న విద్యుత్ సంస్ధలు మెుత్తం ప్రైవేటు పరం అవుతాయని ప్రజలపైన చార్జిల భారం పెరుగుతుందని అన్నారు.గృహా అవసరాలు ,వ్యవసాయం వంటి రంగాలకు ఇస్తున్న సబ్సీడిలు రద్దు అవుతాయని అన్నారు. ప్రభుత్వరంగం మెుత్తం ప్రైవేటు పరమైతే దేశభవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు.విద్యుత్ రంగంతో పాటు రైల్వే, కోల్, సహా అన్నింటిని బిజెపి ప్రభుత్వం తాకట్టు పెడుతుందని విమర్శించారు.విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ లను ఏ పీ ఎస్ సి బి రూల్స్ ప్రకారం పూర్తిస్ధాయిలో పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు . బిల్ కలెక్టర్స్ ని,వీుటర్ రీడర్స్ , అన్ మ్యాన్ వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు . కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లని రద్ధుచేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్వరంగం ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో యు ఈ ఈ యు సినీయర్ నాయకులు కె.రాఘవేద్రరావు ,సాదిక్ విుయా, కునురాజు శ్రీనివాస్, బుడిగే రమేష్, రవింద్రాచారి,జిలాని,మధు విష్ణుమూర్తి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: