మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు అధ్యక్షత న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన పట్ల ప్రజలంతా పూర్తిస్థాయిలో విశ్వాసంతో ఉన్నారన్నారు.దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్, తుళ్ళూరి.బ్రహ్మయ్య, జడ్పీటీసి పొశం.నర్సింహారావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ పటేల్ భద్రయ్య,పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ఎంపీపీలు, జడ్పీటీసీ లు,టిఆర్ఎస్ పార్టీ ఏడూ మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: