గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్ 24 (మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం లో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పర్యటించారు. అడవి రామారం గ్రామంలో చనిపోయిన పాయం పాపారావు దశదిన కర్మ కు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు ని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: