మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగుడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కల్వలనాగరం గ్రామానికి చెందిన ఇర్ప వెంకటనర్సయ్య కుమారుడు ఇర్ప నాగక్రిష్ణ ఖేలో ఇండియా ఆథ్లెటీక్స్ రన్నింగ్ విభాగంలో ఎంపిక కావడంతో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాగక్రిష్ణ'ను అభినందించారు.
ఈనెల గోవా లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వెళ్ళుటకురేగా చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,కరకగూడెం మండల తెరాస పార్టీ యూత్ సంయుక్త కార్యదర్శి ఊకే నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: