చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : సాగులో ఉన్న పోడుదారులందరికి పట్టాలు ఇవ్వాలని జెడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తుంగారం పోడుదారులతో కలిసి తహసిల్దార్ ఉషాశారదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన పోడుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... 2005కు పూర్వం నుండి తుంగారం, రేపల్లెవాడ పంచాయతీలలో పోడు సాగు చేసుకుంటున్నారని, ఇటీవల ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం తో పోడుభూమిని సాగు చేయకుండా చేసి,మొక్కలు నాటాలని, ఇప్పుడు మాకు పోడుకమిటీ వేయకుండా చూడటం సరికాదన్నారు. అర్హత కలిగిన మాకు పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పోడుదారులు, తెరాస నాయకులు బానోతు బీలు, కాంగ్రెస్ నాయకులు ధరావత్ రామారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: