గుండాల నవంబర్ 18 (మన్యం మనుగడ) మండలంలో అనుమతి లేకుండా ధాన్యము కొనే చిల్లర కౌంటర్ నిర్వహించే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తీ లింగయ్య తాసిల్దార్ రంగు రమేష్ కలిసి కోరారు. గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో ఉన్న లైసెన్స్ లేని కొందరు వ్యాపారస్తులు రైతుల వద్ద నుండి వరి, మొక్కజొన్న , పత్తిని తక్కువ ధరకు కొంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి దళారుల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు మార్కెట్ కమిటీ లో అమ్మే విధంగా వారికి అవగాహన కల్పించాలని కోరారు
Post A Comment: