మన్యం టివి ,దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలంలో రైతుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రగళ్లపల్లి లిఫ్ట్ నిర్వాహక కమిటీకి అధ్యక్షురాలిగా మహిళరైతు, ఆయకట్టు సాగుదారు అయిన తెల్లం.సీతమ్మ ని సాగు రైతులందరు కలసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం పెద్ద నల్లబెల్లి గ్రామంలో రైతువేదిక ప్రాంగణంలో జరిగిన ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఆయకట్టు సాగుదార్ల సమావేశం లో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెల్లం.సీతమ్మ మాట్లాడుతూ"ప్రగళ్లపల్లి లిఫ్ట్ క్రింద ప్రస్తుతం సాగులోఉన్న ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తనపై నమ్మకం తో అధ్యక్షురాలిగా ఎన్నుకొన్న రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పిట్టా.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోనాసి. వెంకటేశ్వరరావు,కొమ్ము.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: